New Internship Batch 2026

Real-Time Java & AI Internship Training

For Colleges & Students: Practical coding internship with 100% placement support.

Need Help? Contact Us

Accenture: టెక్కీలకు షాక్.. వేతన పెంపు, ప్రమోషన్లు వాయిదా

Yogi Siddeswara 0
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం కొత్త మలుపు తిరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక వృద్ధి, డిజిటల్ మార్పుల కారణంగా ఐటీ రంగం ఊపందుకుంది. అయితే, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. దీంతో ఐటీ రంగం కూడా ప్రభావితమైంది. 
 ఈ నేపథ్యంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థలలో ఒకటైన యాక్సెంచర్ సంచలన నిర్ణయం తీసుకుంది. 

భారతదేశంలోని తన ఉద్యోగులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వేతన పెంపులను తాత్కాలికంగా నిలిపివేస్తోందని యాక్సెంచర్ ప్రకటించింది. అయితే, చట్టబద్ధంగా అవసరమయ్యే లేదా ముఖ్యమైన నైపుణ్యం ఉన్న రంగాల్లో అవసరమైన మేరకు ఇంక్రిమెంట్‌లు అందించనున్నట్లు స్పష్టం చేసింది.
యాక్సెంచర్ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశంలోని టెక్కీలకు షాక్‌గా మారింది. ఇటీవల కాలంలో భారతీయ ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులకు పెద్దగా వేతన పెంపులను అందించటం లేదు. అధిక వేతనాన్ని పొందుతున్న వ్యక్తులకు హైక్స్ వాయిదా వేస్తున్నాయి. 

 యాక్సెంచర్ తీసుకున్ న ఈ నిర్ణయానికి ప్రపంచ వ్యాపార వాతావరణం డైనమిక్స్ మారుతున్న తరుణంలో కంపెనీ ఆచితూచి ముందుకు అడుగులు వేస్తోంది అనేది కారణం. అయితే, ఈ నిర్ణయం భారతదేశంలోని టెక్కీలకు ఆందోళన కలిగిస్తోంది. 

 యాక్సెంచర్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారతీయ టెక్కీ రంగానికి ఏం జరుగుతుందీ? యాక్సెంచర్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ టెక్కీ రంగానికి నష్టం జరుగుతుందని నిపుణులు అంటున్నారు."

Post a Comment

0 Comments